telugu navyamedia
వార్తలు సామాజిక

బీఐఎస్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

exam hall entrence

బ‌్యూరో ఆఫ్ ఇండియా స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) వివిధ విభాగాల్లో ఖాలీగా ఉన్న గ్రూప్‌-ఏ, బీ, సీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 171 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగినవారు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ద‌ర‌ఖాస్తు ఫీజు ‌రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళ‌ల‌ల‌కు ఫీజు మినహాయింపు ఉంటుంది.

అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ ‌సెప్టెంబ‌ర్ 26. న‌వంబ‌ర్ 8న ఆన్‌లైన్ ఎగ్జామ్‌ నిర్వహించనున్నారు. మిగితా ఇవరాలకు వెబ్‌సైట్‌: www.bis.gov.in వీక్షించవచ్చు. ఆన్‌లైన్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, టైప్‌టెస్ట్‌, ప్రాక్టిక‌ల్ స్కిల్ టెస్ట్‌, షార్ట్‌హ్యాండ్ టెస్ట్‌, టైపింగ్ స్పీడ్ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Related posts