telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాల్దీవుల్లో భర్తతో ఎంజాయ్ చేస్తోన్న హాట్ బ్యూటీ..

2001లో వచ్చిన బాలీవుడ్‌ మూవీ “అజ్నబీ” తో వెండితెరకు పరిచయమైంది బిపాసా బసు.. తొలి సినిమాతో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు కూడా సొంతం చేసుకుంది. 2002లో మహేష్‌ బాబు “టక్కరదొంగ” లో నటించింది ఈ భామ. తెలుగులో ఆమెకు ఏకైక సినిమా టక్కర దొంగ కావడం విశేషం.  అయితే.. తాజాగా బిపాషా బసు సముద్ర తీరంలో సేద తీరింది. భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలసి వెళ్లి రొమాంటిక్ మూడ్ లో మునిగిపోయింది. భర్త బర్త్ డేని మాల్దీవ్స్ లో సెలబ్రేట్ చేసుకున్న మిసెస్ బిపాషా కరణ్ గ్రోవర్… ఇన్ స్టాగ్రామ్ లో తన ఆనందం వ్యక్తం చేసింది. మాల్దీవ్స్ ఫోటోలు షేర్ చేస్తూ ‘సంవత్సరంలో రెండో అత్యంత ఇష్టమైన రోజు’ అంటూ పేర్కొంది. బర్త్ డే సందర్భంగా ‘ఆకాశం, నీరు కలిసే చోట మేం కలుసుకున్నాం’ అంటూ పొయెటిక్ గా కూడా ఓ పోస్ట్ పెట్టింది. ఈ మధ్య కాలంలో మాల్దీవులకి వెళ్లిన ఇండియన్ సినీ సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా, పెళ్లి కాగానే కాజల్ ఇక్కడి సముద్ర తీరంలోనే హనీమూన్ ఎంజాయ్ చేసింది. భర్త గౌతమ్ కిచ్లూతో ఆమె రొమాంటిక్ ఫోటోలు, వీడియోలు అభిమానుల్ని తెగ అలరించాయి.

Related posts