బైక్ కంపెనీలు భారీ తగ్గింపుతో పండుగ ఆఫర్లు ప్రకటించాయి. బజాజ్ ఆటో, యమహా ఇండియా కంపెనీలు వాటి పలు మోడళ్లపై ధరలను తగ్గించాయి. యమహా మోటార్ ఇండియా తన 150 సీసీ బైక్స్పై ప్రత్యేక ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు ప్రకటించింది. ఎఫ్ జడ్ -ఎస్ ఎఫ్ ఐ బైక్స్పై అదిరిపోయే తగ్గింపు అందిస్తోంది. ఈ మోడళ్లపై ఏకంగా రూ.8,280 వరకు తగ్గించడంతో వినియోగదారులకు ఊరట లభించింది.
అలాగే తక్కువ డౌన్ పేమెంట్ (రూ.4,999)తో బైక్ను కొనొచ్చు. ఇంకా లోన్ తీసుకొని బైక్ తీసుకోవాలంటే వడ్డీ రేటు కేవలం 6.9 శాతంగా ఉంది. ఈ ఆఫర్ ఆక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. యమహా ఎఫ్ జడ్ -ఎస్ ఎఫ్ ఐ ధర రూ.98,180గా, యమహా ఎఫ్ జడ్ ఎఫ్ ఐ బైక్ ధర రూ.96,180గా నిర్ణయించారు.
యమహా మాదిరిగానే బజాజ్ ఆటో కూడా పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు అదిరే డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ డొమినేర్ 400, బజాజ్ ప్లాటిన, బజాజ్ సీటీ 100, బజాజ్ పల్సర్ వంటి మోడళ్లపై రూ.7,200 వరకు తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఐదేళ్ల వారంటీ, ఇతర ఫ్రీ సర్వీసులు వంటివి కలిసి ఉన్నాయి. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుంది.
చంద్రబాబు తనిఖీపై హంగామా అవసరం లేదు: మంత్రి బొత్స