తమ సమస్యలను పరిష్కరించాలని బీహార్ రాష్ట్రంలో కాంట్రాక్టు టీచర్లు రోడ్డెక్కారు. తమకు రెగ్యులర్ టీచర్లతో సమానంగా వేతనాలు అందించాలని ప్రభుత్వాన్ని కాంట్రాక్టు టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులంతా రాజధాని పాట్నాలోని విధానసభకు సమీపంలో ఆందోళన నిర్వహించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కాంట్రాక్ట్ టీచర్లు ప్రభుత్వానికి వత్యిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేపడుతున్న టీచర్లను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు.
మనీష్ ను పక్కన పెట్టడం పై వార్నర్ సంచలన వ్యాఖ్యలు…