బిగ్ బాస్ సీజన్-3 ప్రారంభమై 15 మంది కంటెస్టెంట్స్తో ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ పూర్తయ్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బయటకి వెళ్ళగా, రెండో వారం జాఫర్ని ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హౌజ్లో 14 మంది సభ్యులు ఉండగా, కొందరు గ్రూపుయిజం చేస్తున్నారని దాని వలన పర్టిక్యులర్ పర్సన్స్ని ఎలిమినేట్ చేస్తున్నారని వితికా, పునర్నవి, వరుణ్ సందేశ్ అనుకుంటున్నారు. సోమవారం జరిగిన 16వ ఎపిసోడ్లో తమన్నా.. రవిని టార్గెట్ చేసి రెచ్చిపోయింది. పునర్నవి మరోసారి నామినేట్ కావడంతో ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక ఫైర్ అయింది. ఇక ఈ వారం నామినేషన్లో ఎక్కువ ఓట్లు పొందిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్లు ఎలిమినేషన్లో నిలిచారు.
మూడోవారం మొదటి రోజే బిగ్ బాస్ హౌజ్ హీటెక్కింది. ముందుగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఛాయిసెస్ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఇందులో భాగంగా వితికా, రవికృష్ణని యాక్టివిటీ ఏరియాకి రమ్మని బిగ్ బాస్ ఆదేశించారు. ఒక్కొక్కరు ఒక్కో బాక్స్లో నిల్చొని ఉండగా, నిర్ణయాన్ని గ్రీన్ లేదా రెడ్ బటన్ ప్రెస్ చేసి తెలపాలని అన్నారు. ఇద్దరు రెడ్, గ్రీన్ బటన్ కలిసి ప్రెస్ చేస్తే ఇంట్లోని మగవాళ్లందరు లివింగ్ ఏరియాలో పడుకోవలసి ఉంటుంది, ఒకవేళ రెడ్ మరియు రెడ్ కాంబినేషన్లో బటన్ని ప్రెస్ చేస్తే వారం పాటు డిలామా బూత్లో ఉన్న ఇద్దరు గార్డెన్ ఏరియాలో పడుకోవలసి ఉంటుంది. లేదా ఇద్దరు గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే ఇంట్లోని ఆడవాళ్లెవరు కిచెన్లోకి ఎంటర్ కాకూడదు అని బిగ్ బాస్ తెలిపారు. ఈ క్రమంలో వితికా షెరు రెడ్ బటన్, రవికృష్ణ గ్రీన్ బటన్ నొక్కారు. దీంతో మగవారంతా ఈ వారం లివింగ్ రూమ్లోనే పడుకోవాలని బిగ్బాస్ ఆదేశించాడు.
ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలు కాగా, ఇందులో భాగంగా ఇంటి సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయదల్చుకున్నారో వారు ఇద్దరు కంటెస్టెంట్స్ని ఎంపిక చేసుకొని నుదురు మీద తప్ప.. మిగతా చోట్ల స్టాంప్ వేసి.. నామినేట్ చేయడానికి గల కారణాలను వివరించాలని బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో ముందుగా వచ్చిన తమన్నా.. 1. రోహిణి, బాబా భాస్కర్ 2. రాహుల్.. మహేష్, అలీ 3. వితికా.. శివజ్యోతి, బాబా భాస్కర్ 4. మహేష్.. రాహుల్, పునర్నవి 5. శివజ్యోతి.. వితికా, తమన్నా 6. శ్రీముఖి.. రాహుల్, వితికా 7. అషు.. శ్రీముఖి, తమన్నా 8. హిమజ.. రాహుల్, పునర్నవి 9. వరుణ్ సందేశ్.. మహేష్, శ్రీముఖి 10. బాబా భాస్కర్.. వితికా, పునర్నవి 11. రవిక్రిష్ణ.. తమన్నా, హిమజ 12. అలీ రాజా.. తమన్నా, రాహుల్ 13. రోహిణి.. తమన్నా, పునర్నవి 14. పునర్నవి.. శివజ్యోతి, బాబా భాస్కర్ లని నామినేట్ చేసి అందుకు గల కారణాలు వివరించారు.
అయితే నామినేషన్ ప్రక్రియలో తమన్నా, పునర్నవి హౌజ్లో రచ్చ చేశారు. ముందుగా తమన్నాని.. రవి నామినేట్ చేయడంతో ఆయనపై ఫైర్ అయింది. సిగ్గులేదురా.. అంటూ అసభ్యపదజాలంతో రెచ్చిపోయిన తమన్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది. రవి కామ్గా ఉన్నప్పటికి ఆమెని మిగతా ఇంటి సభ్యులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికి ఆమె ఎవరి మాట వినకుండా రవిని తిట్టే పనిలో ఉంది. ఇంతలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పునర్నవి.. తన మీద మర్యాద ఉంటే సైలెంట్గా ఉండాలని చెప్పడంతో కాస్త శాంతించింది.
ఈ వారం కూడా పునర్నవి నామినేట్ కావడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. నా బాధ చెప్పిన, నేను అందరితో కలిసే ప్రయత్నం చేస్తున్నప్పటికి కొందరు కావాలని నన్ను కార్నర్ చేస్తున్నారు. అందుకే నాకు నేనే నామినేట్ చేసుకుంటున్నానని బిగ్బాస్తో తెలిపింది పునర్నవి. బిగ్బాస్ నియమాల ప్రకారం ఎవరికి వారు నామినేట్ చేసుకోవడం కుదరదని, ఇలా చేస్తే హౌస్మేట్స్ అందర్నీ నామినేట్ చేయవలసి వస్తుందని బిగ్బాస్ ఆదేశించాడు. అంతేకాదు ఈ సీజన్ మొత్తం నువ్వు నామినేషన్లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించాడు. అవేమి పట్టించుకొని పునర్నవి అన్నింటికి రెడీ అయింది. ఇంటి కెప్టెన్గా ఉన్న వరుణ్ సందేశ్ ఆమెని పక్కకి తీసుకెళ్లి తనని బుజ్జగించి నామినేషన్ వేసేందుకు ఒప్పించాడు.
నామినేషన్లో పాల్గొన్న పునర్నవి .. బాబా భాస్కర్, శివజ్యోతిని నామినేట్ చేసింది. హౌస్లో అందరికీ బాబా భాస్కర్ హీరోనేమో కానీ తనకు కాదని నిక్కచ్చిగా చెప్పింది. బాబా భాస్కర్ కూడా హౌస్లో ఓ కంటెస్టెంటే అని చెప్పుకొచ్చింది. నామినేషన్ తర్వాత బాబా.. పునర్నవి దగ్గరకి వెళ్లి సారీ చెప్పాడు. అయితే తమన్నా మాత్రం తనదైన శైలిలో రవిని టార్గెట్ చేస్తూ అనరాని మాటలు అంటూనే ఉంది. రోహిణి ఆమెని శాంత పరచాలని చూసినప్పటికి ఆమెపై కూడా ఫైర్ అయింది. తాను ఇలానే స్ట్రైట్గానే ఉంటానని, ముందు ముందు చుక్కలు చూపిస్తానంటూ వార్నింగ్లు కూడా ఇచ్చింది. మొత్తానికి సోమవారం ఎపిసోడ్లో తమన్నా, పునర్నవిల రచ్చతో బిగ్ బాస్ హౌజ్ వేడెక్కింది. ఇక ఈ రోజు దొంగ పోలీస్ ఆటకి సంబంధించిన ఓ టాస్క్ బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇవ్వగా వారు తమ ప్రదర్శనతో ప్రేక్షకులని సందడి చేయనున్నారు.