బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కార్యక్రమం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా… ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వెళ్ళారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్. అయితే ఈ సీజన్కు టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి శని, ఆదివారాల్లో హోస్ట్ చేసి ఎలిమినేషన్ చేస్తూ వచ్చిన నాగార్జున ఈవారం అందుబాటలో ఉండరట. అందుకోసం ఆయన తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లారు. ఈ కారణంగా బిగ్బాస్ 3లో ఈవారం హోస్ట్గా నాగ్ కనపడనుండటం అనుమానంగానే మారింది. మరి ఆయన లేకపోతే బిగ్బాస్ 3ని ఎవరు హోస్ట్ చేస్తారనే దానిపై పలు వార్తలు వినపడుతున్నాయి. మీడియా వర్గాల సమాచారం మేర ఈ వారం రమ్యకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తారట. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.
previous post