బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు కార్యక్రమం సక్సెస్ఫుల్గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని పదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. గత వారం హిమజ ఎలిమినేట్ అయ్యింది. పదో వారంలో శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్లలో ఒకరు ఇంటి నుండి బయటకి వెళ్లనున్నారు. అయితే ఈ షో మొదటి వారం రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ సాధించినా… ఆ తర్వాత వారం నుండి రేటింగ్ దారుణంగా ఉంది. ఇంటి సభ్యుల మద్య గొడవలు జరక్క పోవడంతో పాటు అంతా సేఫ్ గేమ్ ఆడుతున్న కారణంగా షో ప్రేక్షకులకు అంతగా ఎక్కడం లేదు. బిగ్ బాస్ గొడవలు పెట్టించేందుకు ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దానికి తోడు బలమైన కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేట్ అయ్యి వీక్ కంటెస్టెంట్స్ మాత్రమే ఉంటున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఫైనల్ వరకు ఉంటాడనుకున్న అలీ రెజా ఎలిమినేట్ అవ్వడం పట్ల పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండు సీజన్ లతో పోల్చితే ఈసారి గేమ్ ఏమాత్రం సరిగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలీ రెజీ రీ ఎంట్రీ ఇవ్వాలని అంతా కోరుకున్నారు. అలీ రెజా వెళ్లి పోయి రెండు వారాలు గడిచిన నేపథ్యంలో ఆయన ఎంట్రీ ఉండక పోవచ్చు అంటూ అంతా భావిస్తున్న నేపథ్యంలో ఒక జాతీయ ఆంగ్ల మీడియా సంస్థ అలీ రెజా ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఒక కథనం ప్రచురించింది. స్టార్ మా వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం అందినట్లుగా ఆ కథనంలో పేర్కొనడం గమనార్హం. వీకెండ్స్ లో నాగార్జున వచ్చి వెళ్లిన తర్వాత అంటే వచ్చే సోమవారం ఎపిసోడ్ లో లేదంటే అంతకు ముందే అలీ రెజా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
previous post