telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కర్నూలు ఎస్పీ మమ్మల్ని టార్గెట్ చేశారు: అఖిలప్రియ

bhuma akhila into ycp soon

కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి, హింసిస్తున్నారని మండిపడ్డారు. యురేనియంతో జరిగే నష్టాలను తెలుసుకోవడానికి కడప జిల్లా పులివెందులకు వెళ్లి వచ్చిన రెండు రోజులకే తన భర్త భార్గవరామ్ పై కేసులు పెట్టారని తెలిపారు.

ఎలాంటి వారెంట్ లేకుండానే హైదరాబాదులోని తమ నివాసంలో సోదాలను నిర్వహించారని అఖిలప్రియ మండిపడ్డారు. సోదాల సమయంలో సీఐలు, ఎస్సైలు మాట్లాడిన విషయాలను రికార్డు చేశామని, జిల్లా ఎస్పీ ఒత్తిడితోనే తాము వచ్చామని వారు చెప్పారని… ఈ ఆధారాలతో వారం రోజుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇక బెయిల్ వచ్చిన తర్వాత కూడా తన భర్త గురించి బెంగళూరులోని తన సోదరి నివాసంలో సోదాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.

Related posts