నటుడు నితిన్ తో వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ‘భీష్మ’ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అనుకుంటుండగా తేదీని ఖరారు చేశారు. ఈ దర్శకత్వంలో వచ్చిన ‘ఛలో’ .. యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. దానితో ఆయన మరో ప్రేమకథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి నాయకా నాయికలుగా ఆయన నితిన్ .. రష్మికలను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘భీష్మ’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.
ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం 25వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సితార బ్యానర్ పై ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. కొంతకాలంగా నితిన్ సక్సెస్ అనే మాటను వినలేదు. అందువలన సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాతో ఆ ఆశ నెరవేరుతుందేమో చూడాలి.