telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది: భట్టివిక్రమార్క

Batti vikramarka

కేసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుందని సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో టీకాంగ్రెస్ నేతలు ఈరోజు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై భట్టి విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా తాము నిర్వహించాలనుకున్న ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అన్నారు. బీజేపీ కవాతుకు, ఎంఐఎం సభకు అనుమతిచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ర్యాలీని అడ్డుకోవాలనుకోవడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలూ బీజేపీకి మద్దతు పలుకుతున్నాయని చెప్పారు.

తాము ర్యాలీ నిర్వహించే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పోలీసుల నుంచి తమకు లేఖ వచ్చిందని… ర్యాలీ ఎక్కడ చేయాలో మీరే చెప్పాలని, మీరు చెప్పిన మార్గంలోనే ర్యాలీ చేస్తామని పోలీసులకు తాము మరో లేఖ రాశామని చెప్పారు. అయితే, తమ లేఖకు పోలీసుల నుంచి ఇంత వరకు సమాధానం రాలేదని అన్నారు. తాము ర్యాలీని వాయిదా వేసుకోలేదని, ర్యాలీని నిర్వహించి తీరుతామని చెప్పారు.

Related posts