గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి వద్దకు బాలు కుటుంబసభ్యులు, బంధువులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం బాలు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు, పోలీసులు చేరుకున్నారు. తమిళ సినీ దర్శకనిర్మాత భారతీరాజా కూడా ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలు కోలుకోవాలని తాము చేసిన ప్రార్థనలు ఫలించలేదని అన్నారు. తమది 50 ఏళ్ల స్నేహమని, ఈ పరిస్థితుల్లో ఆయనను చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో అభిమానులు ఉన్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు బాలుకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
previous post