నటి పాయల్ ఘోష్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేయబోయాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్కు పలువురు బాలీవుడ్ నటీనటులు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా బెంగాలీ బ్యూటీ రూపాదత్తా కూడా అలాంటి ఆరోపణలే చేసింది. రూపాదత్తా పశ్చిమ బెంగాల్ కర్నిసేన రాష్ట్ర అధ్యక్షురాలని తెలుస్తోంది. అసభ్యంగా చాట్ చేసినట్టుగా ఉన్న 2014 నాటి ఫేస్బుక్ మెసేజ్ల స్క్రీన్షాట్లను ట్విట్టర్లో షేర్ చేసింది. మహిళలను గౌరవించని అతడితో తాను మాట్లాడడం మానేశానని పేర్కొంది. పాయల్ ఘోష్ అతడిపై చేసిన ఆరోపణలు సరైనవేనని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. డ్రగ్స్ తీసుకోవడమే కాక, ఇతరులకు కూడా వాటిని సరఫరా చేస్తుంటాడని తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే పేరు విషయంలో రూపాదత్తా తప్పులో కాలేసింది. నిజానికి ఆ చాట్ చేసింది దర్శకుడు అనురాగ్ కశ్యప్ కాదు.. అనురాగ్ సఫర్ అనే మరో వ్యక్తి. అయితే, అది అనురాగ్ కశ్యపేనని, ఆ పేరుతోనే అతడికి ఫేస్బుక్ ప్రొఫైల్ ఉండేదని పేర్కొంది. ఆ మెసేజ్లు చేసిన అనురాగ్ సఫర్ తాను డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ను కాదని క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే 2009 వరకు తన యూజర్ నేమ్స్లలో కశ్యప్ పేరును ఉపయోగించడంతోనే ఈ గందరగోళం ఏర్పడినట్టు తెలుస్తోంది. అతడు ఐర్లాండ్ లో ఉంటాడని తేలింది. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘న్యూస్ నేషన్’ అనే చానల్ దత్ను ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. కశ్యప్పై ఎన్సీబీ దర్యాప్తు చేయాలని, అలాగే, సుశాంత్ మృతితో అతడికి ఉన్న సంబంధాలను వెలికి తీయాలని నటి డిమాండ్ చేసింది.నిజానికి తాను కశ్యప్ను వ్యక్తిగతంగా కలవలేదని, అతడి చాట్స్ ఆధారంగానే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు పేర్కొంది.
previous post
next post