telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

యాచకురాలి దేశభక్తి .. నేతలకు లేకపాయె..

beggar women donated to pulwama

నేతలు ఎప్పుడు అధికారం చేతిలోకి వస్తుందా, ఎంత దోచుకుందామా .. అనే ఆలోచిస్తున్నారు. అందుకే భారతదేశంతో సహా పలు దేశాలు ఇంకా పేదరికంలో, అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఇలా కొందరి అధికారదాహానికే ఆయా దేశాలు బలైపోతున్నాయి. అయితే ఇలాంటి వారు ఉన్న దేశంలోనే, ఓ యాచకురాలు కూడా ఉంది. ఆమె తాను యాచించడం ద్వారా వచ్చిన సొమ్ము దేశానికే ఉపయోగపడాలని కలలు కన్నది. మొత్తానికి ఆమె తదనంతరం ఆ కోరిక తీరింది. ఆ కథ .. కొందరి కనీవిప్పు కోసం. ఆమె ఓ యాచకురాలు. ఓ గుడి ముందు కూర్చుని ఎండకు ఎండి, వానకు తడిసి రూపాయి రూపాయి కూడబెట్టింది. రోజంతా సంపాదించిన సొమ్మును ఓ బ్యాంకులో జమచేసేది. ఆ సొమ్ముకు ఇద్దరు వ్యక్తులను నామినీలుగా పేర్కొంది. తన మరణానంతరం ఆమె సొమ్ము వారికి చెందేలా చేసింది. గతేడాది ఆగస్టులో ఆమె చివరి శ్వాస విడిచింది. ఇప్పుడామె సొమ్ము పుల్వామా అమరులకు చేరి మరణానంతరం గొప్ప దాతగా పేరుతెచ్చుకుంది.

ఆమె పేరు నందినీ శర్మ. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఆమె భజరంగడ్‌లోని అంబె మాత మందిర్ వద్ద కూర్చుని రోజూ యాచించేది. అలా సంపాదించిన సొమ్మును రోజూ బ్యాంకులో జమచేసేది. ఆ సొమ్ము మొత్తం రూ.6.61 లక్షలు అయింది. గతేడాది ఆమె చనిపోయిన దగ్గరి నుంచి ఆ సొమ్ము బ్యాంకులోనే ఉంది. దానిని విరాళంగా ఇవ్వాలని నామినీలుగా ఉన్న ఆ ఇద్దరు ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. పుల్వామా అమరులకు ఆమె సొమ్మును అందించడం ద్వారా నందినీ శర్మకు ఘనంగా నివాళులర్పించినట్టు అవుతుందని భావించారు.

ఆ సొమ్మును తీసుకెళ్లి కలెక్టర్ విశ్వమోహన్ శర్మకు అందించి అమరుల కుటుంబాలకు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా నామినీల్లో ఒకరైన సందీప్ గౌర్ మాట్లాడుతూ.. యాచకురాలిగా తను సంపాదించిన సొమ్ము దేశానికి ఉపయోగపడాలని ఆమె భావించేదని, అమరుల కుటుంబాలకు ఆ సొమ్మును విరాళంగా ఇచ్చి ఆమె కోరికను నెరవేర్చినట్టు చెప్పారు.

Related posts