నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్కి మాస్ ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ భారీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోతున్న హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని నెలలుగా బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ సాయేషా ట్వీట్తో ఆ చర్చలకు ఫుల్స్టాప్ పడింది. బీబీ 3లో తానే హీరోయిన్గా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసింది సాయేషా. ఈ మూవీలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ విషయమై ఎంతోమందిని పరిశీలించిన దర్శకనిర్మాతలు చివరకు మలయాళ భామ ప్రయాగ మార్టిన్ని ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి క్షణంలో కొన్ని కారణాల వల్ల ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు తెలిసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరోసారి కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా కన్ఫ్యూజన్కి తెరదించుతూ తాను బీబీ3లో భాగం కానున్నట్లు తెలిపింది సాయేషా. ఈ భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కడం గౌరవంగా ఫీల్ అవుతున్నానని, అతి త్వరలో షూటింగ్లో పాల్గొనబోతున్నానని పేర్కొంటూ చాలా ఆతృతగా ఉందని తెలిపింది సాయేషా. కాగా కథ పరంగా ఈ సినిమాలో మరో హీరోయిన్కి కూడా ఛాన్స్ ఉందనే సమాచారాలు వస్తున్నప్పటికీ దీనిపై యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు.
Welcoming beautiful & talented actress @sayyeshaa on board for #BB3. Looking forward to seeing you soon on sets.#BalayyaBoyapati3#NandamuriBalakrishna #BoyapatiSrinu @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/1MDW82uRop
— Dwaraka Creations (@dwarakacreation) November 10, 2020