telugu navyamedia
సినిమా వార్తలు

అఖిల్ కు జోడిగా పూజాహెగ్డే

Pooja-Hegde

2014లో వ‌చ్చిన “ఒక లైలా కోసం” చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన పూజా హెగ్డే టాలీవుడ్‌లో త‌న స‌త్తా చూపుతుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ స్టార్ ఇమేజ్ అందుకుంటుంది. పూజా హెగ్డే ఇటీవ‌ల “మ‌హ‌ర్షి” చిత్రంతో అభిమానుల‌ని అల‌రించ‌గా… ప్ర‌స్తుతం వాల్మీకి, అల‌.. వైకుంఠ‌పుర‌ములో, హౌజ్‌ఫుల్ 4, ప్ర‌భాస్‌-రాధాకృష్ణ చిత్రాల‌తో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డిని మ‌రో ఆఫ‌ర్ ప‌ల‌క‌రించింది. అఖిల్ నాల్గొవ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌కటించారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌ త‌న నాలుగో చిత్రాన్ని అఖిల్ చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్ర షూటింగ్ కూడా మొద‌లైంది. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Related posts