telugu navyamedia
క్రైమ్ వార్తలు

శ్రీకాకుళం జిల్లా వజ్ర‌పుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం..ఏడుగురికి తీవ్ర‌గాయాలు..

*శ్రీకాకుళం జిల్లా వజ్ర‌పుకొత్తూరులో ఏడుగురుపై ఎలుగుబంటి దాడి..ఏడుగురికి తీవ్ర‌గాయాలు..
*ప‌లాస ప్ర‌భుత్వాస్పత్రిలో బాధితులు ప‌హారాలు..
*బాదితుల్లో ఆరుగురి ప‌రిస్థితి విష‌మం..
*మొహం, కాల్లు కొరికేసిన ఎలుగుబంటి..

శ్రీకాకుళం వజ్ర‌పుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామంలో దాదాపు ఏడుగురిపై ఎలుగుబంటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎలుగుబంటి దాడులతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా తెలుగు రాష్ర్టాల్లో ఎలుగుబంటి ఇంత‌మందిపై దాడి చేయ‌డం ఇదే మొద‌టిసారి.

Related posts