telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బీసీసీఐపై బాలీవుడ్ హీరోయిన్ ఫైర్

Dia

బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) నిర్ణయంపై బాలీవుడ్ నటి దియా మీర్జా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ మొండిపట్టుపై దియా మీర్జా ట్విటర్ ద్వారా స్పందించారు. “దిల్లీలో ఎయిర్ క్వాలిటీ లెవర్ డేంజరస్ స్థాయిలో ఉందని తెలిసీ బీసీసీఐ అక్కడ మ్యాచ్ నిర్వహించాలనుకోవడం నన్ను షాక్‌కు గురిచేసింది. కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోకుండా మనమే మన జీవితాలను డేంజర్‌లో పెట్టుకుంటున్నాం. కమాన్ ఇండియా.. కాలుష్యం తగ్గించేందుకు ఏదన్నా చేద్దాం. ముందు మనకున్న యాటిట్యూడ్‌ని తగ్గించుకోవాలి. ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు శ్వాసతోనే మొదలవుతుంది’ అని ట్వీట్ చేస్తూ దిల్లీ ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. దియాకు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. యూన్ ఎన్విరాన్మెంటల్ గుడ్ విల్ అంబాసిడర్‌గా దియా మీర్జా ఎంపికయ్యారు. అప్పటినుంచి కాలుష్యంలేని ప్రకృతి కోసం ఆమె కష్టపడుతున్నారు. ఇలాంటి ట్వీట్లు చేస్తూ ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు. మ్యాచ్‌కి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈలోపు బీసీసీఐ తన మొండిపట్టును వదిలి నిర్ణయం మార్చుకుంటుందో లేక క్రికెటర్ల జీవితాలను రిస్క్‌లో పెడుతుందో వేచి చూడాలి. ఆదివారం దేశ రాజధాని దిల్లీలో తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దీపావళి తర్వాత కాలుష్యం డేంజరస్ స్థాయికి చేరింది. ప్రస్తుతం అక్కడ ఎయిర్ క్వాలిటీ లెవర్ 412కు చేరింది. ఇది అత్యంత తీవ్ర స్థాయి. దాంతో క్రికెటర్లు కాలుష్యంతో ఇబ్బందిపడతారని మ్యాచ్ వేదిక మార్చాలని కొంత మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇదే కాలుష్యంలో క్రికెటర్లు మ్యాచ్‌ ఆడితే వారి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ… భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) మాత్రం వేదికను మార్చడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. మ్యాచ్‌ అక్కడే నిర్వహిస్తామని తేల్చి చెప్పింది.

Related posts