telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ నాటికీ .. వద్దంటే.. ఆడబోము.. : బీసీసీఐ

bcci on world cup matches of india-paka

పుల్వామా ఘటన నేపధ్యమూ భారత్-పాక్ ల మధ్య కనీసం క్రికెట్ మ్యాచ్ లు కూడా ఉండరాదని డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ కప్‌ నాటికి భారత ప్రభుత్వం పాక్‌తో ఆడకూడదని నిర్ణయిస్తే తాము దానిని పాటిస్తామని బీసీసీఐ తెలిపింది. ఆ సమయంలో పాక్‌.. మ్యాచ్‌ ఆడకుండానే పాయింట్లు పొందుతుందని పేర్కొంది. ఒక వేళ ఫైనల్‌లో పాక్‌తో తలపడాల్సి వస్తే వారు మ్యాచ్‌ ఆడకుండానే ప్రపంచ కప్‌ గెలుస్తారని పేర్కొంది. ఈ విషయంలో తాము ఇప్పటి దాకా ఐసీసీని సంప్రదించలేదని వివరణ ఇచ్చింది. ఈ విషయంలో ఐసీసీ చేసేదేమీ లేదని పేర్కొంది.

ఈ విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని, ప్రపంచ కప్‌కు కొద్ది రోజుల ముందు ఇది తేలుతుందని అభిప్రాయపడింది. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ విధంగా స్పందించింది.

Related posts