అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. కొంతమంది బీసీసీఐ వల్లే రాయుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నాడని మండిపడ్డారు. అటు అంబటి రాయుడిని ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనని.. ఆ విషయంలో పశ్చాతాపం అవసరం లేదని తాజా ఇంటర్వ్యూలో బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దాల్ పేర్కొన్నారు.
2003లో తాను సెలెక్టర్గా ఉన్నప్పటి నుంచి రాయుడు, కార్తీక్ ఆడుతున్నారన్న ఆయన.. అప్పటి నుంచి వారికి అనేక అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పారు. తొలి జాబితాలో రిషబ్ పంత్ను ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యం కలిగిందన్న ఆయన.. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు ఎక్కువ ఛాన్స్లు ఇస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
థూ.. దీనమ్మా జీవితం… ఆంటీ ఏంటి ? : పూరీ