నేడు నగర పరిధిలోని 15,40,718 మంది లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. దీనికోసం జీహెచ్ఎంసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరులు చీరల పంపిణీ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అర్హులైన అందరికీ చీరలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆహార భద్రత కార్డున్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.
రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి.. పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారు: దేవినేని