బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళకు తెలంగాణ ప్రభుత్వం చీరలను కానుకగా అందజేయబోతోంది. రేషన్కార్డుల లబ్ధిదారులను అర్హులుగా ఇప్పటికే ఎంపిక చేశారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్, బాచుపల్లి మండలాల్లో ఈ రోజు అధికారులు బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. స్థానిక మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ రాజు హాజరవుతారు. వారి చేతుల మీదుగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 11 గంటలకు బౌరంపేట్ ఫంక్షన్ హాల్లో, నిజాంపేట్లోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంపల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో 3.30 గంటలకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.
రైతు భరోసాపై అట్టుడికిన అసెంబ్లీ.. చంద్రబాబు పై రోజా విమర్శలు