బస్తీదవాఖానాల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజల అవసరాన్నిబట్టి మరిన్నిఆస్ప్రతులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న బస్తీదవాఖానాల్లో విద్యుత్, తాగునీరు వంటి సమస్యలుంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
జీహెచ్ఎంసి పరిదిలోని ప్రజలకు వైద్యం, విద్యా రంగాలతో పాటు గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. వేలాది రూపాయలు ఖర్చుచేసి పేద ప్రజల కోసం ఏర్పాటుచేసిన బస్తీదవాఖానాలలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను కూడా ఉచితంగానే అందిస్తున్నట్టు తెలిపపారు.