telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అమరావతిలో.. బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి.. నేడు భూమిపూజ..

basavataraka cancer hospital in ap capital

ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు భూమి పూజ చేశారు. వెయ్యి పడకలతో మూడు దశల్లో నిర్మించనున్న ఈ ఆసుపత్రి కోసం ఏపీ ప్రభుత్వం తుళ్లూరులో 15 ఎకరాలు కేటాయించింది.

తుళ్లూరు వెళ్లిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించారు. ఈ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు ఫారూఖ్, కిడారి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించనున్న సభకు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ హోదాలో బాలకృష్ణ అధ్యక్షత వహిస్తారు.

Related posts