telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

నేటి నుండే.. భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్‌..

barat-newzeland t20 match from today

నేటి నుండి భారత్-న్యూజిలాండ్ ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఈ సిరీస్ కూడా కైవసం చేసుకోవడానికి చూస్తుంది. ఇక న్యూజిలాండ్ కూడా కనీసం ఈ సిరీస్ అయినా దక్కించుకోవాలని ప్రణాళికలో ఉంది. ఫామ్‌, బలాబలాల పరంగా భారతే ఈ సిరీస్‌లో ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. కానీ పొట్టి క్రికెట్లో న్యూజిలాండ్‌ తక్కువ జట్టేమీ కాదు. పైగా ఈ ఫార్మాట్లో ఎప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పడం కష్టం. ఖచ్చితమైన ఫేవరెట్‌ అంటూ ఎవరూ ఉండరు, నాలుగో వన్డేలో చిత్తయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. సిరీస్‌లో కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిందే.

చక్కటి ఫామ్‌లో ఉన్న కివీస్‌కు వన్డే సిరీస్‌ ఫలితం, ప్రదర్శన మింగుడు పడలేదు, దీనితో టీ20ల్లో అయినా గట్టిగా పుంజుకుని సిరీస్‌ గెలవాలని పట్టుదలతో ఉంది. ఓపెనర్‌ గప్తిల్‌ గాయంతో దూరం కావడం ఆ జట్టుకు ఎదురు దెబ్బే. అయితే కెప్టెన్‌ విలియమ్సన్‌, విధ్వంసక ఓపెనర్‌ మన్రో, సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌, ఆల్‌రౌండర్‌ నీషమ్‌ లాంటి ఆటగాళ్లు సత్తా చాటితే కివీస్‌.. భారత్‌కు దీటుగా నిలవగలదు. కానీ భారత్ కూడా గత 10 టీ20 మ్యాచ్ లలో ప్రతిదీ గెలుచుకుంది. దీనితో ఈ సిరీస్ కూడా ఆసక్తిగానే సాగనుంది. ఇక టీ20 అంటేనే ఎంతో ఆసక్తిగా ఉంటుంది, అది ఇలాంటి పోటీ ఉన్న టీం లు ఆడితే క్రికెట్ అభిమానులకు ఇంక పండగే.

Related posts