telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్యాంకుల విలీనంపై .. ఉద్యోగుల దేశవ్యాప్త నిరసనలు..

bank employees on protest tomorrow

బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలో ఇప్పుడు కావాల్సింది బ్యాంకుల విలీనం కాదని, ఆయా బ్యాంకులు ఆర్ధికంగా నిలదొక్కుకునే చర్యలు తీసుకోవాలన్నారు. సువిశాల దేశంలో ఇంకా బ్యాంకు సౌకర్యం లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారు. పలు బ్యాంకులను విలీనాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సమ్మెకు పిలుపు నిచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని వారు హెచ్చరించారు.

10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూన్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఉన్న 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని, నేటీ ప్రకటనతో దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఆమె తెలిపారు. బ్యాంకుల విలీనం పై చేసిన ప్రకటన నేపథ్యంలోనే విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు శనివారం దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియోషన్ సభ్యులు ప్రకటించారు.

Related posts