రేపు (శనివారం) బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కావాల్సిన టెస్టు మ్యాచ్ను రద్దు చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని ట్విటర్లో ప్రకటించింది. అంతకు ముందు బంగ్లా ఆటగాళ్లు స్థానిక మసీదులో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఆటగాళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడి అనంతరం వారు తీవ్ర భయాందోళనకు గురైన నేపథ్యంలో న్యూజిలాండ్తో జరగాల్సిన మూడో టెస్టు రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఈ విషయంపై బంగ్లాదేశ్ జట్టు అధికార ప్రతినిధి జలాల్ యూనిస్ స్పందించారు. ‘మా జట్టు ఆటగాళ్లు స్థానిక మసీదులో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకొని అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆటగాళ్లందరూ క్షేమంగానే ఉన్నారు. ఈ దాడి నేపథ్యంలో ఆటగాళ్లు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వారిని వెంటనే హోటల్కు తరలించి అక్కడే ఉండమని చెప్పాం’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దుండగుల కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది.