telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీచ చరిత్ర నీది… పీవీపీపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ బండ్ల గణేష్

Bandla

సినీ నిర్మాత, సినీనటుడు, కమెడియన్‌ బండ్ల గణేష్ ఇటీవల రాజకీయాల్లో హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బండ్ల గణేష్ తెలుగు తెరపైకి రీఎంట్రీ ఇచ్చాడు. మహేష్ నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు”లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్‌తో పాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘టెంపర్’ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. బండ్ల గణేష్‌కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన మొత్తానికి గణేష్ చెక్కులు ఇచ్చారు. మిగిలిన డబ్బును చెల్లించాలంటూ గణేష్‌ను పీవీపీ కోరారు. గణేష్‌కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా గణేష్‌తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.ఆ తర్వాత ట్విట్టర్‌లో బండ్ల గణేష్ పీవీపీపై విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి వరుస ట్వీట్లతో పీవీపీపై బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పీవీపీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు.

Related posts