2019 ఎన్నికల ముందు వరకు బండ్ల గణేష్ రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అప్పటినుండి ఆయన కనీసం అటువైపు చూడను కూడా చూడలేదు. కానీ తాజాగా తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బండ్ల పేరు తీశారు. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్.. ఇప్పుడు బండి సంజయ్ కామెడీ షో చేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పేరు మారిస్తే ఏమొస్తుంది? అని ప్రశ్నించారు. పేరు మార్చడం కాదు… పరిపాలన విధానం మార్చుకోవాలని సూచించారు కవిత. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు.అయితే కవిత వ్యాఖ్యల పై ట్విట్టర్ వేదికగా బండ్ల స్పందించారు. తన ట్విట్టర్ లో బండ్ల గణేశ్ ” నేను జోకర్ ను కాదు. ఫైటర్ని.. కానీ నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. నన్ను అందులోకి లాగొద్దు” అని ట్వీట్ చేశారు.
previous post