telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతులను గందరగోళంలోకి నెడుతున్నారు: బండి సంజయ్

BJP Bandi sanjay

నూతన వ్యవసాయ చట్టం బిల్లుకు రాజ్యసభలోనూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. , ఈ బిల్లును టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నూతన వ్యవసాయ చట్టం తేనె పూసిన కత్తి వంటిది అని సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. రైతులకు ఎంతో ప్రయోజనం కల్పించే ఈ చట్టంపై రైతులను గందరగోళంలోకి నెడుతున్నారని ఆరోపించారు.

పేద రైతుల సంక్షేమానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టం బిల్లును తేనె పూసిన కత్తి వంటి చట్టం అంటూ విమర్శించడం సరికాదని అన్నారు.ఉత్పత్తుల క్రయ విక్రయాల్లో రైతులకు, వ్యాపారులకు వాణిజ్య మార్గాల ద్వారా గిట్టుబాటు ధరల లభ్యతకు అనువైన వాతావరణం కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని వివరించారు.

Related posts