telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కరీనంగర్‌లో వికసించిన కమలం..బండి సంజయ్‌ ఘన విజయం

against bjp trying to apply last weapon as mp resigns

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తూంటే కరీంనగర్‌లో మాత్రం కమలం వికసించింది. 
కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన  బండి సంజయ్ కు సానుభూతి పవనాలు వీచాయి. గత ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కరీంనగర్ ఓటర్లు మార్పు చూపించారు. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని పక్కకుపెట్టి  బండి సంజయ్ ను  భారీ మెజారిటీతో గెలిపించారు.

Related posts