telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు…కానీ బీజేపీకి సమయం ఇవ్వండి : బండి సంజయ్‌ రిక్వెస్ట్‌

ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేతాజీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో నియంత పాలనను ఎదిరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. నాయకత్వానికి ప్రతీక, అందరికి స్ఫూర్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని…నేతాజీ పరక్రమాన్ని తెలుసుకునేలా భవిష్యత్తు తరాల కోసం ఆయన జయంతిని పరాక్రమ దివస్ గా ప్రధాని మోడీ ప్రకటించారని తెలిపారు. “నాకు రక్తాన్ని ఇవ్వండి… మీకు స్వేచ్చను ఇస్తాను” అన్న గొప్ప నేత నేతాజీ అని…చరిత్రను తెరమరుగు కాకుండా చూడాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు. అన్యాయం, అక్రమాలను ఎదిరించాలి అని చెప్పిన నేత నేతాజీ అని… నేతాజీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో కూడా అక్రమాలను, అవినీతిని నియంత పాలనను ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపి కి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని కోరారు బండి సంజయ్‌. తెలంగాణలో రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నియంత, అవినీతి అక్రమా పాలన నుంచి కాపాడుకునేందుకు ప్రతి యువకుడు బిజెపి కి సమయము ఇవ్వాలనీ కోరుతున్నానని తెలిపారు.

Related posts