telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ పైసల్ తీసుకోండి.. ఓటు బీజేపీకి వేయండి : బండి

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా బీజేపీ అభ్యర్థి రవి కుమార్ నాయక్ ను గెలిపించాలని కోరుతూ గుర్రంపుడు మండలం కొప్పోలులో రోడ్డుషో లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోతల రాయుడు  సీఎం కేసీఆర్ సాగర్ కు వస్తున్నాడు… కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తా అన్నాడు.. ఇప్పటి వరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు.. టీఆరెస్ దొంగలు వచ్చారు.. దగుల్ బాజిగాళ్లు వచ్చారు.. మద్యం డబ్బుతో మాయమాటలతో మోసం చేసేందుకు వచ్చారు.. అని ప్రజలకు హెచ్చరించారు.. టీఆర్‌ఎస్‌కు ఎందుకు సాగర్ లో ఓటు వేయాలని ప్రశ్నించిన బండి.. అన్ని కేంద్రం ఇస్తే కేసీఆర్ ఏమి పికుతాడు అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన నిధులు లెక్కలు అన్ని తీసుకొని వచ్చాను.. రేషన్ బియ్యానికి 29 రూపాయలు కేంద్రం ఇస్తుంది.. రాష్ట్రం ఒక్క రూపాయి ఇస్తున్నారు.. ఓటు ఎవరికి వేస్తారో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు 10 వేలు ఇస్తున్నారు… తీసుకోండి.. ఓటు మాత్రం బీజేపీకి వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. పేదవాళ్లను ఆదుకుంటామన్నారు బండి సంజయ్. కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటు  కేసీఆర్ ఫొటోలు పెట్టుకుంటున్నారని విమర్శించారు బండి సంజయ్… నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్ ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. నల్గొండ జిల్లాకు వివిధ పథకాల కింద 1683 కోట్లు ఇచ్చామన్నారు.. ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది.. కానీ, కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ చెబుతున్నారని ఫైర్ అయ్యారు.. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్న ఆయన.. ప్రభుత్వన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Related posts