telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు : బండి సంజయ్

బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకడు తాగుబోతు మంత్రి, ఒకడు తిరుగుబోతు మంత్రి అన్ని చోట్లా ఇద్దరి ఫోటో లే….మంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టరు అని ఆయన ప్రశ్నించారు. బాత్ రూంల దగ్గర కూడా కేసీఆర్ ఫోటోలు అంటే జనం నవ్వుతున్నారని అన్నారు. 6 వేల కోట్ల ఆదాయం ఉన్న జీహెచ్ఎంసిలో వరద సాయం 600 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. మళ్ళీ చెపుతున్నా…..ఘాట్ లను టచ్ చేస్తే…దారుసలాం కూల్చివేస్తా అంటూ అయన పేర్కొన్నారు. ఇంట్లో భార్య పిల్లలకు చెప్పి వచ్చా…చావుకు నేను బయపడను అని ఆయన అన్నారు. ఇక ఈ ఎన్నికల తరువాత అవినీతి ప్రభుత్వం కూలిపోతుందన్న ఆయన కేసీఆర్ జైల్ కి పోవడం ఖాయం….కేంద్రం అన్ని లెక్కలు తేల్చుతుందని అన్నారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని అన్నారు. అమిత్ షా వస్తున్నాడు…టీఆర్ఎస్ జాగ్రత్తగా ఉండాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె సమయం లో ఆత్మగౌరవం ఏమయ్యింది ?భారత్ బయోటెక్ కు ఇప్పటి వరకు సీఎం KCR ఎందుకు పోలేదు….ఎక్కడ పడుకున్నాడు ? అని ఆయన ప్రశ్నించారు.

Related posts