telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ పెద్దల బినామీలే కాంట్రాక్టర్లు: బండి సంజయ్

BJP Bandi sanjay

రాష్ట్రంలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. కొండపోచమ్మ ప్రాజెక్టు కెనాల్ కు గండిపడిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టుల వద్ద గండ్లు పడి నీళ్లు లీకవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దల బినామీలే కాంట్రాక్టర్లు కావడంతో ఇలాంటి లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.

కాళేశ్వరం, మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఇలా అన్ని ప్రాజెక్టుల్లో గండ్లు పడ్డాయని అన్నారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్ల లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కాముల కోసమే స్కీములు పెట్టారని, అందుకు కొండపోచమ్మ కెనాల్ కు పడిన గండి నిదర్శనమని ఆరోపించారు.

Related posts