బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్య వర్గ మొదటి సమావేశం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికలు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్ లు గుర్తుకు వస్తాయి, లేఖలు రాస్తారని చురకలు అంటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. కార్పోరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తుందని…ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందన్నారు. పైసలు వెదజల్లి టీఆర్ఎస్ గెలిచింది.. తెరాస ఎక్కడ విజయోత్సవాలు జరుపుకోలేదు… ఎలా గెలిచారో వారికి తెలుసు అని పేర్కొన్నారు. ఎందరో ప్రాణ త్యాగాల వల్ల ఈ రోజు బీజేపీ ఈ స్థాయికి వచ్చిందని…వారి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని బండి సంజయ్ అన్నారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా కృషి చేయాలని.. గోల్కొండ కోట మీద కాషాయ జెండానే మనకు కనిపించాలని తెలిపారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు…అమరుల త్యాగాలతో ఏర్పడ్డ కేసీఆర్ కుటుంబం…తెలంగాణలో చేరి దోచుకుంటుందని ఫైర్ అయ్యారు.
previous post
next post