telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అబద్ధాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారు: బండి సంజయ్

Bandi sanjay bjp

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనే మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ అయిందని దుయ్యబట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆశయంతో ఏర్పడిన తెలంగాణలోప్రజలు అన్నింటా వంచనకు గురవుతున్నారని అన్నారు.

అబద్ధాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల ఆశయాలు నెరవేర్చేలా మలిదశ ఉద్యమాన్ని చేపడతాం. కేసీఆర్ గడీలను బద్దలు కొడతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి బీజేపీ కంకణం కట్టుకుందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts