యాదాద్రి పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకి భువనగిరి పట్టణంలో ఘన స్వాగతం పలికారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, కార్యకర్తలు. భువనగిరి పట్టణంలో తన మిత్రుడు నార్ల నర్సింగరావు ను కలుసుకున్న దత్తాత్రేయ…ఇటీవలే వివాహం అయిన నర్సింగరావు కుమార్తెను , అల్లుడిని దత్తాత్రేయ ఆశీర్వదించారు. దత్తాత్రేయ ని పూలమాల తోపాటు, శాలువా తో సత్కరించారు బీజేపీ జిల్లా నాయకులు, స్థానిక కార్యకర్తలు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించిన దత్తాత్రేయ..అనంతరం భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు దత్తాత్రేయ మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి వల్ల దేశ, రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిని అతలాకుతలం చేసింది. నా రాజకీయ జీవితంలో గానీ, ప్రజా జీవితంలో గానీ నేను ఇంత నిర్బంధం లో లేను. ఈ కష్ట కాలంలో అందరూ ధైర్యంగా నిలబడాలి…కోవిడ్ నియమాలను అందరూ పాటించాలి. వ్యాక్సిన్ మన దేశం లో తయారవటం మన దేశానికి అభినందనీయం. హైదరాబాద్ ఔషద నగరి…ఇది ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తో సఖ్యత తో ఉండి మరింత లబ్దిపొందాలని తెలిపారు. అలాగే కోవిడ్ మీద విజయం సాధిస్తాం.. ఇంకా వేగంగా భారత దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
previous post