హైదరాబాద్లో వినాయక నిమజ్జనం నిరాడంబరంగా జరుగుతోంది. నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్లో అధికారులు ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు.
తొలిసారి బాలాపూర్ లడ్డూ వేలంపాటను నిర్వాహకులు రద్దు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ… లడ్డూ వేలం ప్రక్రియను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లడ్డూ వేలంపాటను రద్దు చేసినట్టు ఉత్సవ కమిటీ ప్రకటించింది. వేలం పాట లేకుండానే బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది.