ఎన్నికల ప్రాచారంలో టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుతున్నారు. ముఖ్యంగా అభిమానులపై చెయ్యి చేసుకున్నారనే వార్తలు తరచూ వస్తుంటాయి. ఓ వీడియో జర్నలిస్టుని తిట్టం, ఓ అభిమానిని వెంబడించి మరీ కొట్టడం లాటి సంఘటనలు తీవ్ర దుమారం రేపాయి. బాలయ్య తీరు మార్చుకోకుంటే కష్టం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనలపై బాలయ్య సతీమణి వసుంధర తాజాగా స్పందించారు. బాలయ్య అభిమానులతో చాలా చనువుగా ఉంటారని వసుంధర చెప్పారు.
ఫ్యాన్స్ను మనవాళ్లే అనుకునే మనస్తత్వం బాలయ్యది అని కొనియాడారు. బాలయ్య ఓ దెబ్బ కొట్టినా కూడా అభిమానులు ఏమీ అనుకోరన్నారు. అభిమానులకు బాలయ్య అంటే ఇష్టమని.. అందుకే వారు సంతోషంగానే ఉంటారన్నారు. కొందరు కావల్సుకొని బాలయ్య వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హిందూపురం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. పేదలకు అండగా ఉండే మనస్తత్వం బాలయ్యదని చెప్పారు. బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్గా ఉన్న బాలయ్య పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందిస్తున్నారని చెప్పారు.