telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సతీసమేతంగా .. ఓటు హక్కు వినియోగించుకున్న .. బాలకృష్ణ ..

balakrishna voted with wife

నేడు ఏపీలో పోలింగ్ కావున ప్రముఖులు వారివారి ఓటు హక్కును వినియోగించుకుంటూ, మిగిలిన వారిని కూడా వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. అదేవిధంగా, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య వసుంధరతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన బాలయ్య ఓటేశారు.

బాలకృష్ణ ఓపిగ్గా క్యూలైన్ లో నిలుచొని తమ వంతు రాగానే పోలింగ్ ఆఫీసర్ కు ఐడీ కార్డును చూపించి ఓటేశారు. అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లకోసారి మాత్రమే ఓటేసే అవకాశం వస్తుందని బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో ఓటు హక్కును వినియోగించుకోవడం సొంత ఊర్లో వినియోగించుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.

Related posts