telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సింహాచలేస్వరుడి సన్నిధిలో .. బాలకృష్ణ..

balakrishna visited simhachalam temple

నేడు నటుడు నందమూరి బాలకృష్ణ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ‘రూలర్‌’ సినిమా డిసెంబరు 20న విడుదల కాబోతున్న నేపథ్యంలో స్వామి వారిని బాలయ్య దర్శించుకున్నారు. ఆయనతోపాటు వేదిక, తదితర చిత్ర బృందం కూడా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది బాలయ్యకు తీర్థప్రసాదాలు అందించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘యన్‌.టి.ఆర్‌’ చిత్రం తర్వాత బాలయ్య నటించిన సినిమా ‘రూలర్‌’. కేఎస్‌ రవికుమార్‌ దర్శకుడు. వేదిక, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. జయసుధ, భూమిక, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత బాలయ్య దర్శకుడు బోయపాటి సినిమాలో నటించబోతున్నారు.

Related posts