టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని పర్యటన వాయిదా పడింది. జనవరి 16న ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని, రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతారని వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. బాలయ్య బాబు అమరావతికి వెళ్లలేదు. అనివార్య కారణాలతో బాలయ్య తన పర్యటనను రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 18న అమరావతిలో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి బాలయ్య బాసటగా నిలుస్తారని వెల్లడించాయి.
previous post
next post
మోదీని సంతృప్తి పరచడానికే ఎగ్జిట్ పోల్స్: విజయశాంతి