నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ వైజాగ్ నుంచి పార్లమెంటుకు పోటీ చెయ్యడాని టికెట్ కోసం అమరావతిలో కొన్ని రోజులుగా వేచి వున్నాడని తెలిసింది .
వైజాగ్ గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎమ్ వి వి ఎస్ మూర్తి గారి మనవడు శ్రీ భరత్ . బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని ని శ్రీభరత్ 2013లో వివాహం చేసుకున్నాడు . బాలకృష్ణ మొదటి కుమార్తె బ్రాహ్మణి ని నారా లోకేష్ వివాహం చేసుకున్నాడు .
లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయిన తరువాత బాలకృష్ణ రెండవ అల్లుడు శ్రీ భరత్ కూడా తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని ప్రకటించాడు . శ్రీభరత్ తాత ఎమ్ వి వి ఎస్ మూర్తి చాలా సంవత్సరాల నుంచి తెలుగు దేశం పార్టీలో వున్నాడు . పార్లమెంట్ సభ్యుడుగా కూడా పనిచేశారు .
మూర్తి గారు చనిపోయాక శ్రీభరత్ విశాఖ పట్టణం నుంచి పార్లమెంట్ సభ్యుడుగా పోటీ చెయ్యాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు . బాలకృష్ణ కూడా అల్లుడు విషయం చంద్ర బాబు దగ్గర ప్రస్తావించినట్టు తెలిసింది . అల్లుడు భరత్ ను అమరావతిలో ఉండమని చెప్పి బాలకృష్ణ ప్రచారానికి హిందూపూర్ వెళ్లినట్టు తెలిసింది .
శ్రీభరత్ కు టికెట్ చంద్ర బాబు ఇస్తాడా లేదా అనేది తెలియడం లేదు . అయినా శ్రీ భరత్ ప్రయత్నం చేస్తూనేవున్నాడట .
కశ్మీర్ ప్రజలను జైలుకు తరలిస్తున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా