telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మళ్ళీ నోరు జారిన బాలయ్య…!?

Bala krishna comments ys jagan

హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలకృష్ణ ప్రచారంలో తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా తన నియోజక వర్గంలో పర్యటనలో పాల్గొన్న బాలకృష్ణ మెజారిటీ విషయంలో అభిమానులు చేసిన వ్యాఖ్యలపై అదుపుతప్పి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిన్న రాత్రి హిందూపురం రోడ్ షోలో పాల్గొనగా అభిమానులు “జై బాలయ్య” అని నినాదాలు చేశారు.

అందులో కొంతమంది అభిమానులు మాత్రం ఆయనకు 40 వేలు, 60 వేలు మెజారిటీ వస్తుందని అనగా స్పందించిన బాలయ్య, “వేలు ఏంట్రా?” అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ “నీ ఎంకమ్మా… వేలు ఏంట్రా వేలు… నీ బొంద… వేల మెజారిటీ కాదు… నీ పేరేంట్రా చెప్పురా? నీ సంగతి చెబుతా… వేసి పడదొబ్బుతా…” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా బాలయ్య యాంటీ ఫ్యాన్స్ కంటబడడంతో వీడియో వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు కూడా బాలయ్యపై పలురకాల కామెంట్లు చేస్తున్నారు.

Related posts