telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేను తిడితే నా అంత బూతులు తిట్టేవారు ఉండరు : బాలకృష్ణ సంచలనం

ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లోకల్‌ ఎలక్షన్స్‌పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. అటు మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అటు టీడీపీ తరఫున ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో ఫుల్‌ బిజీగా ఉన్నారు. హిందూపురం నియోజక వర్గంలో బాలయ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున బాలయ్య బాబు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను తిడితే నా అంత బూతులు తిట్టేవారు ఉండరు. నాకు ఒక పనికాదు.. ఎన్నో పనులు ఉంటాయి. నేను చేస్తున్నది ప్రజాసేవే.. విమర్శిస్తే ఊరుకోను. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి చైర్మన్‌గా రోగులకు సేవలు అందిస్తున్నాను. సినిమాల ద్వారా ప్రజలకు వినోదం అందిస్తున్నా. నాకు సంస్కారం ఉంది. నోరు పారేసుకుంటే ఊరుకోను” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts