అమరావతి రాజధానిగా కొనసాగించాలని టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ ఆందోళనలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా ధర్నాల్లో పాల్గొని అరెస్టులు కూడా అవుతున్నారు. జగన్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రైతులు, మహిళలకు మద్దతుగా ఊరూరా తిరుగుతున్నారు. చంద్రబాబైతే ఏకంగా జోలె పట్టి ఉద్యమ నాయకులకు విరాళాలు సేకరిస్తున్నారు. పార్టీలో పునరుత్తేజానికి రాజధాని ఉద్యమాన్ని ఒక ఆయుధంగా మలచుకోవాలనుకుని చూస్తున్నారు. టీడీపీలో కీలక నేతగానైనా బాలయ్య స్పందించి ఉండాల్సిందని, ఉద్యమానికి మరింత ఊపువచ్చేలా పాదం కదిపివుంటే బాగుండేదని సగటు తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి సినీ అభిమానులూ కోరుకుంటున్నారు. కానీ నెలన్నర రోజులుగా అమరావతి అట్టుడికిపోతున్నా, బాలయ్య మాత్రం మౌనవ్రతంలోనే ఉన్నారు.
టీడీపీలో బాలయ్య కీలక నాయకుడైనా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది రాయలసీమ నుంచే కాబట్టి, ఇక్కడ తన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారట. అందులోనూ సీమలోనే బాలయ్యకు ఫ్యాన్స్ ఎక్కువ. సీమ నేపథ్యంలో వచ్చిన సమరసింహారెడ్డి వంటి చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అందుకే మూడు రాజధానుల టాపిక్లో తలదూర్చితే, అటు నియోజకవర్గంలోనూ, ఇటు సీమలో ఫ్యాన్స్పరంగానూ ఇబ్బందేనని నందమూరి హీరో లెక్కలేశారట. ఇలా అనేక అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు, విశ్లేషణలు. మొత్తానికి వీటన్నింటికి తెరదించబోతున్నారు బాలయ్య బాబు. రేపు రాజధాని గ్రామాల్లో బాలకృష్ణపర్యటించనున్నారట.
ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల ఆవేదన చెందేవారు: సుజనా చౌదరి