తూర్పు గోదావరి జిల్లా తుని మండలం లోవలో అత్యంత ప్రాచీనమైన తలుపులమ్మ వారిని ఆదివారం ఉదయం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. బాలయ్యను ఆలయ పూజారులు ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బాలయ్య రాకతో అభిమానులు పెద్ద ఎత్తున గుడికి తరలివచ్చారు. అభిమానులకు అభివాదం చేస్తూ బాలయ్య ముందుకు కదిలారు. బాలకృష్ణతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు పూర్వీకులు చెబుతుంటారు.