telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

బక్రీద్ నేపథ్యంలో జమ్ము‌కశ్మీర్‌లో .. నిషేధాజ్ఞలను తొలగింపు …

bakrid celebrations in J & K on monday

కేంద్రం బక్రీద్ నేపథ్యంలో జమ్ము‌కశ్మీర్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాజ్ఞలను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోమవారం ప్రజలు బక్రీద్‌ను జరుపుకునేలా చర్యలు తీసుకోనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. చెదురుమదురు సంఘటనలు మినహా కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బక్రీద్ కోసం నిషేధాజ్ఞలను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిషేధ ఉత్తర్వుల సడలింపు కోసం స్థానిక యంత్రాంగం ఇప్పటికే జాబితాను సిద్ధం చేసింది.

ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఆయన స్వయంగా కశ్మీర్ వీధుల్లో తిరిగి భద్రతా పరమైన అంశాలను పర్యవేక్షించారు. స్థానికులతో కలిసి మాటలు కలిపారు. వారితో కలిసి భోజనం చేస్తూ తాజా పరిస్థితులపై ఆరా తీశారు. నిషేధాజ్ఞల వల్ల నిత్యావసరాల విషయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే వాటిని సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

Related posts