ఆంధ్రరాష్ట్రంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేసినా కూడా ఇంకా నేతలు గట్టు డాడుతూనే ఉన్నారు. తాజాగా, కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన బైరెడ్డి రాజశేఖర్రెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. తెలుగుదేశంలో చేరాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే శ్రీశైలం బరి నుంచి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డిని దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. టికెట్ హామీ దొరికితే ఇవాళే సీఎం చంద్రబాబు సమక్షంలో బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వస్తావా…? అని ఎవరూ అడగరు… క్యాస్టింగ్ కౌచ్ పై స్వాతి సంచలన వ్యాఖ్యలు