telugu navyamedia
సినిమా వార్తలు

మోహన్ బాబుకు బెయిల్ మంజూరు… 30 రోజులు గడువిచ్చిన కోర్టు

Mohan-Babu

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు హైదరాబాదు ఎర్రమంజిల్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షను, రూ. 41.75 లక్షల జరిమానాను విధించింది. బాధితుడికి మోహన్ బాబు ఈ మొత్తాన్ని చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో 30 రోజుల్లోగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో మోహన్ బాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 రోజుల్లోగా దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరికి డబ్బును చెల్లించాలని ఆదేశించింది. 2010లో సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి “సలీం” సినిమా పారితోషికం విషయమై మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. ప్రస్తుతం మోహన్ బాబుకు జైలు శిక్ష పడిందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది.

Related posts